కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ దాడులు

27 Oct, 2015 08:59 IST|Sakshi

విజయవాడ:  కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నాటు సారా తయారుచేస్తున్న 17 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 1800 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు