షుగర్‌ ఫ్యాక్టరీల అధ్యయానికి నిపుణుల కమిటీ

16 Sep, 2014 22:23 IST|Sakshi
హైదరాబాద్: రాష్ట్రంలో షుగర్‌ ఫ్యాక్టరీల అధ్యయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిపుణుల కమిటీలో సభ్యులుగా సర్వారాయ షుగర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్ సుధాకర్‌ చౌదరి, మధుకాన్‌ షుగర్స్ సలహాదారు భరద్వాజ, ఏపీ సీడ్స్ డైరెక్టర్‌ ఎన్‌వీ నాయుడు, ఆడిటర్ శ్రీనివాస్‌మోహన్ నియమితులయ్యారు. 
 
రాష్త్రంలోని షుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ఓ నివేదికను అందచేయనుంది. నిపుణుల కమిటీ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది. 
మరిన్ని వార్తలు