మహానంది పుణ్యక్షేత్రంలో దొంగల చేతివాటం

13 Mar, 2016 12:50 IST|Sakshi

కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో దొంగల చేతివాటం పెరిగిపోయింది. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన అనురాధ అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలసి మహానందీశ్వరుని దర్శనం కోసం వచ్చారు. కోనేరులో మూడు మునకలు వేసి వచ్చి చూడగా.. ఒడ్డున ఉంచిన వస్త్రాలు మాయం అయ్యయి. అందులోని రూ.1200 నగదు, కారు తాళం పోయాయని గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

మరిన్ని వార్తలు