‘అనంత’–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవే

2 Aug, 2017 01:48 IST|Sakshi
రహదారి పక్కనే రైలు మార్గం : మంత్రి అయ్యన్న వెల్లడి
 
సాక్షి, విశాఖపట్నం: అనంతపురం–అమరావతి మధ్య రూ.27 వేల కోట్లతో ఆరులేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గాన్ని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే 393 కిలోమీటర్లని మొత్తం ఐదు జిల్లాల గుండా వెళుతుందని, దేశంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ హైవేల్లో ఇది మూడోదని పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు