పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు

4 Feb, 2015 18:18 IST|Sakshi
పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి బయలుదేరే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విశాఖ, మచిలీపట్నం, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 5వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ తాత్కాలిక అదనపు బోగీల సౌకర్యం ఉంటుందని పేర్కొంది. ఈ అదనపు బోగీల వల్ల 4752 బెర్తులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు