ఏపీలో మరిన్ని పెప్సీకో ప్లాంట్లు: ఇంద్రానూయి

3 Apr, 2015 11:13 IST|Sakshi
ఏపీలో మరిన్ని పెప్సీకో ప్లాంట్లు: ఇంద్రానూయి

తిరుమల : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని గుర్తించినట్లు పెప్సీకో ఛైర్మన్ అండ్ సీఈవో ఇంద్రానూయి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రానూయి మాట్లాడుతూ శ్రీసిటీలో ఫ్లాంట్ను ప్రారంభించేముందు స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీర్వాదాలతో ప్రతిపనీ వియజవంతం అవుతుందని ఆమె తెలిపారు. ఆంధ్రపద్రేశ్లో పెప్సీ ఫ్లాంట్ పెట్టడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాంలో మరిన్ని ప్లాంట్లు పెట్టే ఆలోచన ఉన్నట్లు ఇంద్రానూయి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతో పాటు తాము కూడా కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు