మాస్క్‌.. 'ఆర్ట్‌' టచింగ్‌

27 May, 2020 12:40 IST|Sakshi

కరోనా రాకాసి కోరలు చాచుకొని కూర్చుంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ) పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుతో కొంతమంది మాస్క్‌లు ధరించకుండానే బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఫైన్‌ వేస్తారని తెలిసినా లైట్‌ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు వీఎంసీ నగరంలోని పలు గోడలపై మాస్క్‌లతో కూడిన చిత్రాలను గీయిస్తోంది. పాత  బస్టాండ్‌ వద్ద ఓ గోడపై వేసిన దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు.-సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

మరిన్ని వార్తలు