వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌

25 Apr, 2019 04:35 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం

న్యాయపరమైన చర్యలకు హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో తప్పుడు ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ అవుతూ ఉండటం పట్ల ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు