అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య

16 Aug, 2015 14:18 IST|Sakshi

అచ్యుతాపురం(విశాఖపట్నం): అప్పుల్లో కూరుకుపోయిన కౌలురైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఎస్. అప్పారావు(48) గ్రామానికి చెందిన రంగస్వామి అనే రైతు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటలు సరిగా పండక అప్పుల అధికమవడంతో.. వాటిని తీర్చే దారి కనపడక పోవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు