పాల్వంచ :సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న ఓ గిరిజన కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పుల్లాయి గూడేనికి చెందిన చెట్టుపల్లి రమేష్(25) మరో ముగ్గురు రైతులతో కలసి మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని బొబ్బర్లు సాగు చేశాడు. దిగుబడి తక్కువగా రావటంతోపాటు, మిగతా రైతులతో విభేదాలు తలెత్తాయి.
దాదాపు రూ.లక్ష వరకు ఉన్న అప్పు తీరే దారి కనిపించకపోవటంతో శుక్రవారం ఇంట్లోనే పురుగులమందు తాగి చనిపోయాడు. ఇతనికి వృద్ధులైన తల్లిదండ్రులు భద్రు, శాంతమ్మ ఉన్నారు.