అప్పుల బాధతాళలేక రైతు ఆత్మహత్య

20 Sep, 2015 17:58 IST|Sakshi

కర్నూలు(ఆస్పరి): అప్పుల బాధతాళలేక ఓ రైతు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఆస్పరి మండలం అలగిరి గ్రామానికి చెందిన ఓబయ్య(50) అనే రైతు తన పొలంలో తొమ్మిది బోర్లు వేయించాడు. అయినా చుక్కనీరు పడలేదు. బోర్ల కోసం సుమారు రూ.5 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం తోచకపోవడంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆధోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ మరణించాడు.

మరిన్ని వార్తలు