పురుగులమందు తాగి కౌలురైతు ఆత్మహత్య

11 Dec, 2015 10:40 IST|Sakshi
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గోపాలపురానికి చెందిన విశ్వేశ్వర రావు కు చెందిన పంట ఎండిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అప్పుల తీర్చే మార్గం కనపడక పోవడంతో పురుగుల మందు తాగి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విశ్వేశ్వర్ రావు మృతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
మరిన్ని వార్తలు