గుండెపోటుతో రైతు మృతి

26 Jan, 2016 11:33 IST|Sakshi
కొయ్యలగూడెం: అప్పుల భారంతో భరించలేక ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన పందిరిపల్లి సత్యనారాయణ (45)కు రెండెకరాల పొలం ఉంది. అవసరాల కోసమంటూ బ్యాంకుల్లో రూ.10 లక్షల వరకు రుణాలు తీసుకున్నాడు. చెల్లించాలంటూ బ్యాంకర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సత్యనారాయణ గుండె పోటుతో మృతి చెందాడు. 
మరిన్ని వార్తలు