విద్యుదాఘాతంతో రైతు మృతి

13 Dec, 2015 17:58 IST|Sakshi

మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటర్ ఆన్ చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు కరెంటు షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.



 

మరిన్ని వార్తలు