తేనెటీగల దాడిలో రైతు మృతి

6 Jan, 2016 19:51 IST|Sakshi

తేనెటీగల కుట్టటంతో తీవ్రంగా గాయపడిన రైతు మరణించాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరివిచింతలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగన్న బుధవారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లాడు. మోటారు పనిచేయకపోవటంతో దానిని బావి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బావిలోని తుట్టెలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా గంగన్నపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల రైతులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు.


 

మరిన్ని వార్తలు