జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం

11 Dec, 2018 07:30 IST|Sakshi

శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పొందర కులాన్ని బీసీల్లో చేర్చారు. మహానేత చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటున్నాం. తహసీల్దార్‌ కార్యాలయాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు అందించేలా మీరు చర్యలు తీసుకోవాలయ్యా..– అధికారుల నీలకంఠం,పొందర కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  కణుగులవలస

 దంత వైద్యుల నియామకం చేపట్టాలి
ప్రభుత్వం దంత వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో సుమారు 20 వేల మంది డెంటల్‌ కోర్సు  పూర్తి చేసి ఉన్నారు. పదేళ్లలో ప్రభుత్వం కేవలం 70 పోçస్టులనే భర్తీ చేసింది. ప్రతి పి.హెచ్,సి, సి.హెచ్‌.సిలో దంత వైద్యులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజారోగ్యం దృష్ట్యా దంత వైద్యుల నియామకానికి కృషి చేయాలి సార్‌..
– డాక్టర్‌ జయకృష్ణ, రాగోలు, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు