కౌలు రైతు ఆత్మహత్య

22 Aug, 2015 13:27 IST|Sakshi

గొల్లప్రోలు: కౌలుకు తీసుకున్న భూమిలో అప్పులు తెచ్చిసాగు చేసిన పత్తి పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో శనివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన అర్జున్(32) ఐదెకరాల భూమిని సాగు చేస్తున్నాడు. రూ. 3.50 లక్షలు అప్పుతెచ్చి పత్తి, వరి పంటలు వేశాడు. సరిగా నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో.. మనస్తాపం చెందిన రైతు శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్జున్ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.

మరిన్ని వార్తలు