సంతబొమ్మాళిలో రైతుల ఆందోళన

12 Sep, 2015 10:01 IST|Sakshi

టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న భావనపాడు పోర్టును వ్యతిరేకిస్తూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో శనివారం ఉదయం దాదాపు 500 మంది రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భావనపాడులో పోర్టు నిర్మించేందుకు 8 వేల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించిందేకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ఈ రోజు బామనపాడులో ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు