అనంతపురంలో ఉద్రిక్తత

29 Sep, 2014 20:08 IST|Sakshi

అనంతపురం: వ్యవసాయ రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు వద్ద బంగారం వేలం పాటను రైతులు సోమవారం అడ్డుకున్నారు.

రుణమాఫీ జరిగేవరకు వేలంపాట నిర్వహించకూడదని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేసేదిలేక బ్యాంకు అధికారులు వేలంపాట నిలిపివేశారు.

మరిన్ని వార్తలు