తండ్రీకొడుకులు మృతి

6 Apr, 2017 08:55 IST|Sakshi
తొండూరు: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తొండూరు మండలం సైదాపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై తండ్రీ కొడుకులు మృతిచెందారు. గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు శివనారాయణరెడ్డి, జగదీష్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
మరిన్ని వార్తలు