తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు

7 Mar, 2015 10:39 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లాలోని నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని తనయుడు వీరాంజి గొడ్డలితో నరికి అతిదారుణంగా హతమార్చాడు.  ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు వీరాంజి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు