సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌

15 Nov, 2019 18:51 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌, నటుడు విజయ్‌ చందర్‌ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్‌డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎన్‌డీసీ చైర్మన్‌గా విజయ్‌ చందర్‌ నిన్న (గురువారం) బాధ్యతలు స్వీకరించారు.

చదవండి: విజయ్‌ చందర్‌కు కీలక పదవి

మరిన్ని వార్తలు