జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ

1 Jul, 2019 18:22 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థలో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ డీఈఓ రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వుల ప్రకారం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 100 శాతం ఫీజు రాయితీ పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాటిటైట్‌ న్యూస్‌ చానల్స్‌ స్టాఫ్‌ రిపోర్టర్స్‌ అసోషియన్‌కు డీఈఓ ఈ ఉత్తర్వులను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డీవైఈఓలు, ఎమ్‌ఈఓలు తక్షణమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థ జర్నలిస్టుల పిల్లలకు ఈ మేరకు రాయితీ కల్పించాలన్నారు.

మరిన్ని వార్తలు