పండుగ రద్దీ ; విజయవాడ-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు

29 Sep, 2017 18:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–సికింద్రాబాద్‌–విజయవాడ  మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్‌ తెలిపారు. విజయవాడ-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (నెంబరు 07207) అక్టోబర్‌ 1 తేదీ రాత్రి 10 గంటలకు  విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

రైలు నెంబరు 07208 సికింద్రాబాద్‌–విజయవాడ ప్రత్యేక రైలు అక్టోబర్‌ 2వ తేదీ సికింద్రాబాద్‌లో రాత్రి 11.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ  చేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో కోరారు.

మరిన్ని వార్తలు