తెలంగాణ కోసం 16 ఏళ్లుగా కష్టపడుతున్నా: విజయశాంతి

31 Jul, 2013 21:26 IST|Sakshi
విజయశాంతికి, టీఆర్ఎస్ పార్టీకి మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్లే కనపడుతోంది. చేరిన కొత్తల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోపల ఒక ప్రత్యేక ఛాంబర్ కేటాయించి, ప్రధానమైన సమావేశాలన్నింటిలోను కేసీఆర్ పక్కనే స్థానం కల్పించేవారు. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం పార్టీకి... విజయశాంతికి మధ్య దూరం బాగా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్ అంతటా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా.. రాములమ్మ మాత్రం వాటికి దూరంగానే ఉండిపోయింది. 
 
ఇక రెండోరోజైన బుధవారం కూడా.. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావును కలవకుండా, మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఆమె 'సాక్షి'తో చెప్పింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ 13 ఏళ్ల నుంచి పోరాడుతుంటే, తాను 16 ఏళ్లుగా కష్టపడుతున్నానని, రాజకీయ పార్టీలకన్నా.. త్యాగాలు చేసినవారికే క్రెడిట్‌ ఇవ్వాలని ఆమె చెప్పారు. 2014లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చే్యాలో దేవుడే నిర్ణయిస్తాడంటూ వేదాంతం వల్లించారు. 
మరిన్ని వార్తలు