5 నుంచి ఏపీ ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

2 Aug, 2017 01:07 IST|Sakshi
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ప్రవేశానికి గాను ఏపీ ఎంసెట్‌–2017 తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్‌ జీఎస్‌ పండాదాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని, 8న సీట్లు కేటాస్తా మన్నారు.

ఇదివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేని వారు కూడా ఈ రెండురోజుల వెబ్‌కౌన్సెలింగ్‌కు వచ్చి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వర్సిటీ కాలేజీల్లో 483, ప్రైవేటు కాలేజీల్లో 31,362 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్లో (హెచ్‌టీటీపీఎస్‌: //ఏపీ ఈఏఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌) ఉంచినట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు