31న ఓటర్ల తుది జాబితా

10 Jan, 2014 00:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓటర్ల తుది జాబితా ప్రకటన ఈ నెల 31వ తేదీకి వాయిదా పడింది. సవరణకు 30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనకు సమయం పడుతున్నందున  జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు గురువారం పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఈ నెల 17 వరకు  సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు