ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం

4 May, 2015 08:23 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది.  తేరు వీధిలో ఉన్న ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసింది.

మరిన్ని వార్తలు