కొత్తూరులో అగ్నిప్రమాదం

23 Feb, 2015 14:06 IST|Sakshi

శ్రీకాకుళం(కొత్తూరు): ప్రమాద వశాత్తూ అగ్గి అంటుకోవడంతో పది పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో పది గుడిసెలతో పాటు ఏడు మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చెర్లం గ్రామంలో చోటుచేసుకుంది. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ప్రజల గుడిసెలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి కృషిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 8 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు