బందర్ బీచ్‌లో భారీ అగ్నిప్రమాదం

23 Apr, 2015 23:48 IST|Sakshi

మచిలీపట్టణం : కృష్ణా జిల్లా మచిలీపట్టణం మంగినపూడి బీచ్‌లోని వైఎస్సార్ పిషర్‌మెన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. వివరాలు..తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ నుంచి వలస వచ్చిన మత్స్య కారులు మంగినపూడి బీచ్‌లోని వైఎస్సార్ పిషర్‌మెన్ కాలనీలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కాలనీలోని 250 గుడిసెలకు గానూ 200 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు