రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మామిడికుదురు మండలం మగటపల్లిలోని ఓ కాలనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో వ్యాపించి 36 తాటాకు గుడిసెలు బూడిద చేశాయి. ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఊహించని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి.
**