వరి చేనులో అగ్నిప్రమాదం

18 Dec, 2015 16:27 IST|Sakshi

పాతపట్నం (శ్రీకాకుళం) : వరి చేనులో పంట నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ.2.75 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అంగరసింగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పాండు తన వరి పొలంలో ట్రాక్టర్‌తో నూర్పిడి చేస్తుండగా మంటలు చెలరేగి ట్రాక్టర్ సహా వరి పంట కాలిపోయింది. ఈ ఘటనలో రూ.2.75 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు.

>
మరిన్ని వార్తలు