విత్తనాల గోదాములో అగ్ని ప్రమాదం

24 Feb, 2016 10:52 IST|Sakshi

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పీఆర్ కాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా పత్తి విత్తనాలు బూడిదయ్యాయి. స్వామిదాసు అనే వ్యక్తి ఇక్కడ ఓ గది అద్దెకు తీసుకుని అందులో రూ.7 లక్షల విలువైన 27 క్వింటాళ్ల పత్తి విత్తనాలు నిల్వ చేశాడు. బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా లేచిన మంటలకు విత్తనాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. స్థానికులే స్పందించి మంటలను ఆర్పివేశారు.
 

మరిన్ని వార్తలు