విజయనగరంలో అగ్నిప్రమాదం

9 Mar, 2016 11:53 IST|Sakshi

కట్టెల పోయి మీద వంట చేస్తున్న సమయంలో ఎగిసిపడిన మంటలు గ్యాస్ సిలిండర్‌కు అంటుంకోవడంతో అది పేలి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేటలో బుధవారం చోటుచేసుకంంది.

గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో వంట చేస్తున్న సంయలో ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు గ్యాస్‌కు అంటుకోవడంతో.. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి చుట్టుపక్కల మూడు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు