సాక్షి, తిరుపతి : తిరుపతిలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని గాంధీ రోడ్డులో ఉన్న కూల్డ్రింక్ షాపులో ఇవాళ ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో పక్కనే ఉన్న ఇతర షాపులకు పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ. 5లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్యూట్ వల్ల జరిగినట్లు తెలుస్తుంది. కాగా జీవనాధారంగా ఉన్న కూల్డ్రింక్ షాపు తగలబడడంతో తామెలా బతకాలంటూ బాధితులు విలపించారు.