ఏలూరులో అగ్నిప్రమాదం

18 Oct, 2018 05:09 IST|Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు వన్‌టౌన్‌లోని ఒక ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షల ఆస్థి నష్టం జరిగినట్లు అగ్నిప్రమాద అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరు తూర్పువీధి గజవల్లివారి చెరువు వద్ద ఉన్న దుకాణాల్లో  సత్యనారాయణ అనే వ్యక్తి మరమరాలు, వేరుశెనగ ఉండలు తయారు చేస్తున్నారు.  ఈ దుకాణంలో బుధవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు