ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్లోని ఒక ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షల ఆస్థి నష్టం జరిగినట్లు అగ్నిప్రమాద అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరు తూర్పువీధి గజవల్లివారి చెరువు వద్ద ఉన్న దుకాణాల్లో సత్యనారాయణ అనే వ్యక్తి మరమరాలు, వేరుశెనగ ఉండలు తయారు చేస్తున్నారు. ఈ దుకాణంలో బుధవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు పేర్కొంటున్నారు.