తిరుమల: తిరుమలలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం 4.45 గంటలకు ఇక్కడి బాలాజీనగర్కు కిలోమీటరు దూరంలోని టెంకాలతోపు వద్ద అడవిలో మంటలు చెలరేగాయి.
సమాచారంతో ఫారెస్ట్ రేంజర్ రామ్లానాయక్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, సిబ్బందితో కలసి సంఘటన స్థలికి చేరుకున్నారు. వాటర్ బ్యాగులతో నీటిని చల్లుతూ మంటలు ఆర్పివేశారు. సుమారు 50 మీటర్ల విస్తీర్ణంలోని అడవి కాలిందని అధికారులు తెలిపారు.