పడవ బోల్తా: మత్స్యకారుడి మృతి

6 Apr, 2016 14:13 IST|Sakshi

పిఠాపురం : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఉప్పాడ సమీపంలోని సముద్రంలో పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో కారిశల పోలీస్ (30) అనే మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా పడవ ఒక్కసారిగా బోల్తాపడటంతో మత్స్యకారుడు నీటిలో మునిగి మృతిచెందాడు. గమనించిన తోటి మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మృతదేహాం కోసం గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు