576 కిలోల గంజాయి స్వాధీనం

21 Jul, 2017 09:30 IST|Sakshi
నర్సీపట్నం: విశాఖజిల్లాలోని నర్సీపట్నంలో పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కేడీపేట అల్లూరి పార్క్‌ వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 కిలోల గంజాయితో పాటు ఓ కారు, ఓ వ్యాను, రెండు ద్విచక్రవాహనాలు, రూ. 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 
 
మరిన్ని వార్తలు