జూనియర్‌ డాక్టర్ల మెరుపు సమ్మె..

19 Sep, 2018 10:34 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ డాక్లర్లు మెరుపు సమ్మెకు దిగారు. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసులో విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శిల్ప ఆత్మహత్య అంశంపై సీఐడీ విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. శిల్ప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన జూడాలు 24 గంటలపాటు మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు