టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు

28 Jan, 2014 11:11 IST|Sakshi
టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు

ఒంగోలు : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పర్చూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి టీడీపీలోకి రావాలంటూ వెలిసిన  ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

టీడీపీలోకి దగ్గుబాటికి తిరిగి స్వాగతం అంటూ  ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా అర్థరాత్రి దాటిన తర్వాత ఆ ఫెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఆ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. కాగా పర్చూరు నుంచి ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు