ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

15 Oct, 2017 15:16 IST|Sakshi

అనంతపురం: అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాటిపై దృష్టి సారించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాలతో ఎక్కడికక్కడేæ పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ప్రజలు వివిధ రోగాలబారిన పడుతున్నారన్నారు. డెంగీ, మలేరియా, చికున్‌గన్యా తదితర విష జ్వరాలు కోరలు చాస్తున్నాయన్నారు. అనేక గ్రామాలు మంచాన పడ్డాయన్నారు. పలువురు మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటిపై ప్రభుత్వం దృష్టి సారించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి వర్షాభావం వల్ల కలిగిన, జరుగుతున్న నష్టాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు