స్వీట్ షాపుల్లో తనిఖీలు

11 Mar, 2016 15:53 IST|Sakshi

తెనాలి (గుంటూరు) : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని స్వీట్ షాపుల్లో ఆహార నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. రీజినల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచందర్‌రావు నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం సోదాలు చేపట్టింది. పలు దుకాణాల్లో మిఠాయిల శాంపిల్స్ సేకరించింది. దుకాణాల్లో నాణ్యమైన పదార్థాలతో తయారుచేసిన వంటకాలను విక్రయిస్తున్నారా లేక కాలం చెల్లిన పదార్థాలతో తయారుచేసినవి విక్రయానికి ఉంచుతున్నారా అనేవి పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు