తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం

14 Jun, 2015 14:46 IST|Sakshi
తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం

తిరుమల: తిరుమలలో ఫుట్‌పాత్ లగేజీ కౌంటర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం పలువురు భక్తులు అసహనంతో విధ్వంసానికి పాల్పడ్డారు. లగేజీ కౌంటర్‌లో ఒక్కరే సిబ్బంది ఉండడంతో భక్తులు క్యూలైన్‌లో భారీ సంఖ్యలో నిలబడిపోయారు. ఎటూ వేళ్లే మార్గం లేకపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో కౌంటర్ విండో అద్దాలను వారు ధ్వంసం చేశారు. కాలినడకన వచ్చిన భక్తులు తమ లగేజీలను ఈ కౌంటర్‌లో ఉంచి వెళ్తుంటారు.

 

 

మరిన్ని వార్తలు