టీడీపీకి గుడ్‌బై

8 Mar, 2014 03:59 IST|Sakshi


 గాజువాక : టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుడివాడ నాగమణి, ఆమె తనయుడు, 65వ వార్డు మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్‌నాథ్ శు క్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు.

టీడీపీలో తమ పదవులకు, పార్టీ క్రీయాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పత్రులను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పం పారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు నాయుడు వైఖరి గందరగోళంగా మారడంతో పాటు ఆ పార్టీ స్థానిక నాయకత్వం కూడా సరిగా లేకపోవడంతో రాజీనామా చేసినట్టు వారు.

మరిన్ని వార్తలు