గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు: నలుగురికి గాయాలు

15 May, 2015 12:44 IST|Sakshi

విజయవాడ: విజయవాడలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని బీఆర్టీఎస్ రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి అధిక వేగంతో వెళ్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలోని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. కారులోని వ్యక్తికి దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు