ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, నలుగురు సజీవ దహనం

29 Nov, 2017 16:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్‌ ఫార్మాటికల్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు