మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ

31 Oct, 2018 13:59 IST|Sakshi

కర్నూలు (హాస్పిటల్‌): జిల్లాలో మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పాములపాడు మండలం కంబలపల్లికి చెందిన క్రిష్ణమ్మ(38), పగిడ్యాలకు చెందిన శివరాజు(35), కర్నూలు కుమ్మరివీధికి చెందిన హర్షవర్దన్‌(3), కోడుమూరుకు చెందిన అనూష (28)కు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మొదటి ముగ్గురు ఊపిరితిత్తుల్లో సమస్యతో ఇటీవల కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేరారు. అనుమానంతో వైద్యులు స్వైన్‌ఫ్లూ పరీక్ష చేయించారు. వ్యాధి సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయ్యింది. అనూష హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. ఈమెకు కూడా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో బాధితుల సంఖ్య 36కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు. 

మరిన్ని వార్తలు