జీపు, లారీ ఢీ: నలుగురు మృతి

14 Nov, 2014 08:31 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములోరిపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనం... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు