టెట్‌ పాసైన గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ

23 Mar, 2018 11:31 IST|Sakshi

ఒంగోలు సెంట్రల్‌: గత ఏడేళ్లలో టెట్‌లో అర్హత సాధించి 2018 డీఎస్సీ పరీక్ష రాయబోయే గిరిజన యువతీ, యువతకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇన్‌చార్జి అధికారి బి.శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, వెంకటాచలం మండలంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 2 నెలల పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26న నెల్లూరు ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌ కార్డు, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రంతో అభ్యర్థులు రావాలని సూచించారు. ఇతర వివరాలకు 81878 99877 సెల్‌ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు